దాతృత్వ విలువను చాటుకున్న మహాదేవపూర్ ఎస్సై బెల్లంకొండ సత్యనారాయణ

లోకల్ న్యూస్, భూపాలపల్లి :
దేశమంతా కరోనా వైరస్ భారిన పడి కకావికలమవుతున్న తరుణంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పీఎస్ కి చెందిన ఎస్సై బెల్లంకొండ సత్యనారాయణ తన దాతృత్వ విలువను చాటుకున్నారు. కరోనా నివారణ, బాధితులకు అండగా నిలిచేందుకు విరాళాల సేకరణకు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపుకు ఆయన స్పందించారు. ఆదివారం పీఎం సహాయ నిధికి ఆన్లైన్ ద్వారా రూ.10వేలు పంపించారు. ఇదిలా ఉంటే గతంలోనూ ఓ వ్యక్తి వైద్యం ఓ సేవా సమితి అధ్వర్యంలో విరాళాలు సేకరించగా ముందుకొచ్చారు. కాగా దాతృత్వ విలువను చాటుతున్న మహాదేవపూర్ ఎస్సై బెల్లంకొండ సత్యనారాయణను పలువురు అభినందిస్తున్నారు.

Post a Comment

أحدث أقدم