ఎలక్ట్రానిక్ మీడియా దాతృత్వం : పోలీసులకు మాస్కులు పంపిణీ చేసిన జర్నలిస్టులు

లోకల్ న్యూస్, భూపాలపల్లి : మహదేవపూర్ ఎలక్ట్రానిక్ మీడియా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్-19 వైరస్ నుండి ప్రజల సంరక్షణ కోసం 24×7 వారి ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆదివారం సాయంత్రం మహాదేవపూర్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో మహాదేవపూర్ సీఐ నర్సయ్య ,కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్, ఏ. ఆర్ ఎస్సై గోవర్ధన్, మహాదేవపూర్ ఎస్సై బెల్లం సత్యనారాయణ తోపాటు కానిస్టేబుల్ మరియు సీఆర్పీఎఫ్ జవాన్లకు మాస్కులు అందజేశారు. 
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు,యస్,డి జమిల్, ఎం.రాజబాబు, ఆడుప.రమేష్, మొహమ్మద్ హాజీ, కొల మహేష్ పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم