ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. II వేతనాల్లో భారీ కోత..

లోకల్ న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాక్‌ ఇచ్చింది. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 75శాతం కోత విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారితో పాటు సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో కూడా 75 శాతం కోత విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. వారితో పాటు అఖిల భారత సర్వీస్‌ అధికారుల వేతనాల్లో 60 శాతం.. మిగిలిన కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం, అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం, నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధించనున్నారు.

Post a Comment

Previous Post Next Post