నిన్న అష్టాచెమ్మా, నేడు పేకాట.. పేకాట ఆడి 17మందికి కరోనా అంటించాడు

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విజయవాడలో ఒకే వ్యక్తి ద్వారా 17 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలుసుకున్నారు. విజయవాడలోని కృష్ణలంకలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలోని 17 మందికి ఒకే వ్యక్తి ద్వారా కరోనా సోకినట్టు తెలుస్తోంది. 

Post a Comment

أحدث أقدم