సఖ్యతకు సలాం...! దాతృత్వం చాటిన ట్రస్టు

లోకల్ న్యూస్, మహాదేవపూర్ :  సఖ్యత చారిటబుల్ ట్రస్టు తన దాతృత్వాన్ని చాటుకుంది. శని వారం ఆ ట్రస్టు ఆధ్వర్యంలో మహాదేవపూర్ లో పనిచేస్తున్న వివిధ శాఖలకు చెందిన అధికారులకు మాస్క్ లు, శానిటైజర్లు  పంపిణీ చేశారు. ప్రధానంగా కరోనా వైరస్ కు తెగించి విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి పోలీస్ శాఖకు చెందిన ఎస్సై, సీఐ తో పాటు సిబ్బందికి, గ్రామ పంచాయతీ సర్పంచి శ్రీపతి బాపుతో పాటు పంచాయతీ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మాకోసం తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వారికి మేము అందించే ఈ వస్తువులు ఎంతో కొంత ఉపయోగ పడతాయని సఖ్యత చారిటబుల్ ట్రస్టు చైర్మన్ శ్రీమతి శ్రీ సూర్య దేవర వనిత రాజ శేఖర్ అన్నారు. 
ఈ కార్యక్రమంలో సీఐ నర్సయ్య,ఎస్సై బెల్లంకొండ సత్యనారాయణ,  కోశాధికారి అంజయ్య, ట్రస్టు సభ్యులు తోట సుధాకర్,వేల్పుల చంద్రమౌళి  పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم