కరోనా నుంచి తెలంగాణకు స్వల్ప ఊరట

లోకల్ న్యూస్, హైదరాబాద్: కరోనా నుంచి తెలంగాణకు స్వల్ప ఊరట లభించింది. ఆదివారం ఒక్కరోజే 11 మంది కరోనా బాధితులకు నెగిటివ్‌ రిపోర్ట్‌లు వచ్చాయి. గతంలో నెగిటివ్‌గా మారిన రెండింటిని పాజిటివ్‌ కేసులుగా నిర్ధారించారు. ఇప్పటి వరకు 67 మందికి పాజిటివ్‌ వస్తే అందులో 13 మందికి నెగిటివ్‌గా వచ్చాయి. ఈ వార్త తెలంగాణ సమాజానికి సంతోషాన్ని కల్గించింది. శనివారం రాష్ట్రంలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం మాత్రం అత్యధికంగా 14 కేసులను పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆదివారం మాత్రం కేవళం రెండు కేసులను మాత్రమే పాజిటివ్‌గా గుర్తించారు. ఇవాళ ఒక్క రోజే 11 మంది కరోనా బాధితులను నెగిటివ్‌గా నిర్ధారించారు. దీంతో తెలంగాణ ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. 11మందికి నెగిటివ్ రిపోర్ట్స్ రావడంతో కొంత ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 54 మంది కరోనా బాధితులు ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్నారు. 

Post a Comment

Previous Post Next Post