కరోనా వైరస్ పట్ల జాగ్రత్త వహించండి : నేతకాని రాష్ట్ర యూత్ అధ్యక్షులు గోమాస సచిన్

లోకల్ న్యూస్, భూపాలపల్లి : ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పై పతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని నేతకాని రాష్ట్ర యూత్ అధ్యక్షులు గోమాస సచిన్ అన్నారు. శనివారం కాటారం మండలం జాదరావుపేట గ్రామపంచాయతీలో కరోనా వైరస్ పై అవగాహన చేసి గ్రామస్తులకు సబ్బులు పంపిణీ చేశారు. 
అనంతరం మహాదేవపూర్ మండలం నేతకాని కాలనిలో కరోనా వైరస్ నిర్మూలన లో బాగంగా శుచి,శుభ్రత పాటించాలని కాలనీ వాసులకు సూచించారు. నేతకాని సంఘం ఆధ్వర్యంలో డెటాల్ సబ్బులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎస్ ఐ నరేష్, సర్పంచ్ రాజయ్య,యూత్ సభ్యులు విక్రమ్,మనోజు,సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم