కేంద్రం ప్రకటన..ఏప్రిల్ 14న జాతీయ దినం..

లోకల్ న్యూస్, జాతీయం : ఇప్పుడు ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో భాగంగా కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసే చివరి తేది ఇదే. రోజూ బిజీబిజీగా తిరిగే వాళ్లకు ఈ లాక్ డౌన్ సరికొత్త అనుభవాన్ని మిగిలిస్తుందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. లాక్ డౌన్ ముగిసే ఏప్రిల్ 14ను అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే.. ఆ రోజు రాజ్యాంగ సృష్టికర్త బీఆర్ అంబేడ్కర్ జయంతి కావడంతో.. కేంద్రం సెలవుగా ప్రకటించింది.

మరోవైపు దేశవ్యాప్త లాక్ డౌన్‌ను పొడిగిస్తారా.? లేదా ఆంక్షలతో కూడిన సడలింపులతో ఎత్తివేస్తారా.? అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో.. అది మూడో దశకు చేరుకోకుండా మరికొన్ని రోజులు లాక్ డౌన్ విధించాలని కొంతమంది రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అటు మోదీ కూడా పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేసే ఛాన్సులు లేవని చుచాయిగా చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్ని రోజుల వరకు లాక్ డౌన్ పొడిగించాలన్న విషయాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయమ్మ్లో లాక్ డౌన్ చివరి తేదీ ఏప్రిల్ 14న జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.

Post a Comment

Previous Post Next Post