దేశ వ్యాప్తంగా 14 కరోనా హట్ స్పాట్ కేంద్రాలు ఇదిగో.. జాగ్రత్త సుమా !

లోకల్ న్యూస్, కరోనా అప్డేట్స్ : దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 3072 కేసులు నమోదు కాగా.. అందులో 75 మంది ప్రాణాలు విడిచారు.. 213 మంది కోలుకున్నారు. ఇక ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది.

ఈ నేపధ్యంలో కేంద్రం అప్రమత్తమై కేసులు ఏయే చోట్ల పెరుగుతున్నాయన్న దానిపై దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా నివారణకు మరింత పటిష్టంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 14 కరోనా హాట్ స్పాట్స్‌ను గుర్తించింది.

దిల్షాద్ గార్డెన్ (ఢిల్లీ), నిజాముద్దీన్ (ఢిల్లీ), నోయిడా (ఉత్తరప్రదేశ్), భిల్వారా (రాజస్థాన్), కాసర్‌గడ్ (కేరళ), పతనంతిట్ట (కేరళ), కన్నూరు (కేరళ), ముంబై (మహారాష్ట్ర), పుణె (మహారాష్ట్ర), యావత్మల్ (మహారాష్ట్ర), ఇండోర్ (మధ్యప్రదేశ్), జబల్‌పూర్ (మధ్యప్రదేశ్), అహ్మదాబాద్ (గుజరాత్), లద్దాఖ్ (లద్దాఖ్)లు దేశవ్యాప్తంగా ఉన్న కరోనా హాట్ స్పాట్స్‌గా కేంద్రం గుర్తించింది.

Post a Comment

أحدث أقدم