లోకల్ న్యూస్, కాళేశ్వరం : కరోనా వైరస్ కు భయపడనవసరం లేదని జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుందంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో ఎస్సై శ్రీనివాస్ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. బస్టాండ్ సమీపంలోని కూడలి వద్ద ప్లెక్సీని ఏర్పాటు చేసిన ఎస్సై కరోనా దరిచేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో ఉంచారు. ప్లెక్సీలో సూచించిన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటించి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
కరోనాకు భయపడకండి.. జాగ్రత్త పడండి చాలు.. ప్లెక్సీ ఏర్పాటు చేసిన కాళేశ్వరం ఎస్సై
byAshok Yadav
0
تعليقات
إرسال تعليق