ఆర్మీ జవాన్ కు కరోనా పాజిటివ్


జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. బాదితుడు పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఆర్మీ జవాన్ గా పని చేస్తున్నాడు. గతనెల 18న అతని స్వగ్రామం అయిన బండనాగారం గ్రామానికి రాగా ఈ నెల 20న అతని నుండి శాంపిల్ సేకరించి టెస్ట్ కి పంపగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. తాజాగా నమోదు అయిన కేసుతో జనగామ జిల్లాలో మొత్తం 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు కోలుకొని ఇళ్లకు వచ్చారు. పద్నాలుగు రోజులుగా కొత్త కేసులు లేవనుకుంటున్న తరుణంలో మరో పాజిటివ్ కేసు జిల్లా యంత్రంగాన్ని కలవరపెడుతుంది.

Post a Comment

Previous Post Next Post