బాబు పేరు ‘లాక్ డౌన్’.. పాప పేరు ‘కరోనా’.. మన వాళ్లే...

లోకల్ న్యూస్,జాతీయం: కరోనా వైరస్, లాక్ డౌన్. ఈ రెండు పదాలు వింటే ప్రజల గుండెల్లో వణుకు పుడుతోంది. ఈ రెండూ మళ్లీ తమ జీవితంలో చూడకూడదని అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. అయితే, అలాంటి పేర్లను పిల్లలకు పెట్టారు తల్లిదండ్రులు. ఇది ఎక్కడో కాదు. మన భారతదేశంలోనే జరిగింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలా తమ పిల్లలకు ఇలాంటి పేర్లు పెట్టారు తల్లిదండ్రులు. ఉత్తర్ ప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో ఖుకుందు గ్రామంలో మార్చి 30వ తేదీన ఓ బాబు పుట్టాడు. ఆ పసిబిడ్డకు తల్లిదండ్రులు ‘లాక్ డౌన్’ అని అతడి తల్లిదండ్రులు పేరు పెట్టారు. ‘అతడు లాక్ డౌన్ సమయంలో పుట్టాడు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటించారు. దేశ ప్రజల క్షేమం కోసం మోదీ తీసుకున్న ‘లాక్ డౌన్’ నిర్ణయాన్ని మా బాబుకు పెట్టాం.’ అని ఆ బాలుడి తండ్రి పవన్ చెప్పారు. ఈ పేరు విన్నప్పుడల్లా కరోనాతో పాటు వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు ముఖ్యమనే భావన ప్రజల్లో వస్తుందని తాము భావిస్తున్నట్టు తెలిపారు. అబ్బాయి పుట్టిన ఆనందం ఉన్నా.. తమ సెలబ్రేషన్స్‌ను వాయిదా వేసుకున్నట్టు చెప్పారు.

ఇక మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున యూపీలోని గోరఖ్‌పూర్‌లో పుట్టిన పసిబిడ్డకు ఆ బాలిక మేనమామ నీతిష్ త్రిపాఠీ ‘కరోనా’ అని పేరు పెట్టాడు. అయితే, అందుకు బాలిక తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నట్టు చెప్పాడు. కరోనా అనే భయంకరమైన పేరును ఆ పసిబిడ్డకు పెట్టడానికి కారణాన్ని కూడా చెప్పాడు. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఐక్యం చేసిందని తెలిపాడు. అలాగే, ఎన్నో మంచి అలవాట్లు కూడా నేర్పిందని చెప్పాడు. కరోనా అనే మహమ్మారి మీద పోరాటాన్ని ఈ బాలిక గుర్తు చేస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పాడు.

Post a Comment

Previous Post Next Post