సోడియం హైపో క్లోరైడ్ ను స్ప్రే చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

లోకల్ న్యూస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ మూడోవ డివిజన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో  పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వారి ఇంటి ఆవరణంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని,ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని,లాక్ డౌన్ ను పొడిగిస్తే ప్రజలందరు సహకరించాలని ఎందుకంటే మన ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదని అన్నారు.అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇంటి నుండి బయటకు రాకూడదని,మీ చేతుల్లో మీ ప్రాణాలతో పాటు మీ కుటుంబ సభ్యుల,మీ ఊరి ప్రజల ప్రాణాలు ఉన్నాయని వారు ఎవరు బయటకు రాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మూడోవ డివిజన్ కార్పొరేటర్ మరియు మండల తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم