కరోనా పై పోరుకు రంగంలోకి దిగిన సైన్యం..

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): కరోనా వైరస్‌పై పోరాడేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర సైనిక, పారామిలటరీ బలగాలు, ఎన్‌సీసీ కేడెట్లను రంగంలోకి దించినట్లు ఆ రాష్ట్ర సర్కారు వెల్లడించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ సైనికాధికారులతో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా సైనికులు, పారామిలటరీ, ఎన్‌సీసీ కేడెట్లను వెంటనే రంగంలోకి దించామని ఉత్తరాఖండ్ రాష్ట్ర అధికారులు వివరించారు.

Post a Comment

أحدث أقدم