మర్కజ్ వెళ్లొచ్చిన తండ్రి నుంచి కూతురుకి సోకిన కరోనా..



భూపాలపల్లి : ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వల్ల రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తికి ఇప్పటికే కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇదే భూపాలపల్లి జిల్లాలో మొదటి కేసు. అయితే ఇప్పుడు ఆయన కూతురు అమ్రీన్ (20)కి కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో జిల్లాలో మొట్టమొదటి కాంటాక్ట్ పాజిటివ్ కేసు కూడా నమోదైనట్లు జిల్లా వైద్య అధికారి గోపాల్ రావు తెలిపారు. మొత్తంగా భూపాలపల్లి జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.

Post a Comment

أحدث أقدم