రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

లోకల్ న్యూస్ : జయశంకర్​ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ బండలవాగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిడం సునీల్ (18) మృతి చెందగా దుంప రాజశేఖర్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. పలిమెల మండలంలోని మోదేడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వివిధ అవసరాల నిమిత్తం ద్విచక్ర వాహనంపై మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లికి వెళ్లి వారి గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. బండలవాగు సమీపంలో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో సునీల్ అక్కడిక్కడే మృతి చెందాడు. రాజశేఖర్ తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన రాజశేఖర్ ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.

Post a Comment

Previous Post Next Post