కాళేశ్వరాలయంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

లోకల్ అప్డేట్స్(వెబ్ డెస్క్), ఏప్రిల్ 01 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు పంపిణీ చేసి  విద్యార్థులంతా పరీక్షలు ఉన్నతంగా ఆకాంక్షించారు. అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరం పదవ తరగతి  విద్యార్థులు ఉతీర్ణత పొంది మంచి మార్కులతో పాస్ కావాలని సరస్వతీ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ మహేష్, ఆలయ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, కాళేశ్వరంగ్రామ సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత-మోహన్ రెడ్డి , కాళేశ్వరం ఎంపీటీసీ రేవెల్లి మమత-నాగరాజు ఆలయ ధర్మకర్తలు కుంభం పద్మ, కలికోట దేవేందర్,అడప సమ్మయ్య, సిద్ధాంతి భాను ప్రకాష్,కామిడి రామిరెడ్డి, డి.ప్రశాంత్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆర్టికల్ ఫోటో గ్యాలరీ :

Post a Comment

Previous Post Next Post