దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం

యాదవ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి
మహాదేవపూర్(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 3 :  తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని యాదవ సంఘం, పలు ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సోమవారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో యాదవ సంఘం, పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దొడ్డి కొమురయ్య త్యాగాలను స్మరించుకుని నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లచ్చయ్య యాదవ్, యాదవ సంఘం నాయకులు పిడుగు బాపు యాదవ్, కాట్రేవుల సమ్మయ్య, పర్శవేని ఐలయ్య, జాగరి అశోక్ యాదవ్, ఎమ్మార్పీఎస్ నాయకులు తూటిచర్ల దుర్గయ్య, కొయ్యల సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, గంగారపు సాయి, హిమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم