ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

పాల్గొన్న మండల ప్రజా ప్రతినిధులు
మహాదేవపూర్(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 5 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రి నందు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ బెల్లంపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ 116వ జయంతి జరుపుకోవడం అదృష్టమని,అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయడంలో కీలకపాత్ర వహించిన మహనీయులు అని పేర్కొన్నారు. మహనీయుని అడుగుజాడలో నడవాలని వారు చేసిన సామాజిక ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని నేటి తరం ముందు వరుసలో ఉండాలని కోరారు.  ఈసందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని  రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుడాల అరుణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గంట చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు అన్కారి ప్రకాష్, సూరారం సర్పంచి  నాగుల లక్ష్మారెడ్డి, పలిమెల సర్పంచ్ జవ్వాజి పుష్పలత, చిలక రమేష్,దళిత సంఘాల సీనియర్ నాయకులు నల్లబూగ ధర్మయ్య, వేమునూరి జక్కయ్య, బుర్రి శివరాజు, లింగాల సమ్మయ్య, మోతే సమ్మయ్య, మంథని రవితేజ, మహాదేవపూర్ ఎమ్మార్పీఎస్ టౌన్ ప్రెసిడెంట్ చింతకుంట్ల కుమార్, ఎడపల్లి గ్రామ అధ్యక్షులు చేకుర్తి రాజశేఖర్,బెగుళూరు గ్రామ అధ్యక్షులు కోరాల ప్రతాప్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم