బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్ల నారాయణ రెడ్డి

మహాదేవపూర్(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 5 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన నాగుల మహేష్ మృతదేహాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి బుధవారం పరిశీలించారు. మంగళవారం రాత్రి  కడుపు నొప్పితో బాధపడుతూ పురుగుల మందు తాగి వరంగల్ MGM హాస్పిటల్'కి తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో మరణించగా మహేష్ మృత దేహాన్ని తిరిగి మహాదేవపూర్  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మహేష్ మృతదేహన్ని  మధ్యాహ్నం నుండి   పోస్ట్ మార్టం చేయకుండా ఉండడంతో డాక్టర్'తో మాట్లాడిన నారాయణ రెడ్డి పోస్ట్ మార్టం  చేయాలనీ ఆదేశించారు. పోస్ట్ మార్టం ముగిసే వరకు ఉండి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం సూరారం గ్రామ సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డితో కలిసి మృతుని పార్థివ దేహానికి నివాళులు ఆర్పించారు.

Post a Comment

أحدث أقدم