హరిత మొక్కలకు నీటిని అందిస్తున్నాం : పలిమెల సర్పంచ్

లోకల్ న్యూస్, పలిమెల : హరితహారంలో నాటిన మొక్కలకు ప్రతి రోజు నీరు పోసి, వాటిని జాగ్రత్తగా సంరక్షించాలని  పలిమెల సర్పంచ్ జవ్వాజి పుష్పలత-తిరుపతి అన్నారు. ఆదివారం పలిమెల మండల కేంద్రంలో నాటిన మొక్కలకు నీరు పొసే కార్యక్రమాన్ని ఆమె దగ్గరుండి పర్యవేక్షించారు. ఎండా కాలం ప్రారంభం అయినందున నీరు లేక పోతే చెట్లు చనిపోయే ప్రమాదం ఉన్నందున నీటి సరఫరా నిలిపి వేయరాదని సిబ్బందికి సూచించారు. 

Post a Comment

Previous Post Next Post