వలస కూలీలకు అన్నదానం.. మహాదేవపూర్ కు చెందిన ఐలయ్య దాతృత్వం..

లోకల్ న్యూస్, మహాదేవపూర్ : దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు సొంత ఊర్లకు బయలు దేరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచిస్తున్నప్పటికి తప్పనిసరి పరిస్థితుల్లో సొంత ఊర్లకు ప్రయాణమవుతున్నారు. ఈక్రమంలో ఆకలి గా ఉన్నవారికి ఆసరాగా నిలుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన ఐలయ్య యాదవ్ ప్రధాన రహదారి ప్రక్కన ఏకంగా ఓ బోర్డునే ఏర్పాటు చేశారు. వలస కూలీలకు తమ వద్ద భోజన సదుపాయం కల్పిస్తున్నామని అందులో పేర్కొన్నారు. కాగా ఆకలితో అలమటిస్తున్న వలస కూలీల పట్ల ఐలయ్య చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post