నీరు నిరంతరం అందేలా చూడండి..

లోకల్ న్యూస్, మహాదేవపూర్ : వేసవి కాలం ప్రారంభం అవ్వడంతో మండలంలో త్రాగు నీటి సమస్య తలెత్తకుండా చూడాలని మిషన్ భగీరథ ఈఈ నిర్మలను ఎంపీపీ బంసోడ రాణీభాయి కోరారు.  బుధవారం మండల కేంద్రంలో మిషన్ భగీరథ అధికారులతో సమావేశమైన ఎంపీపీ నీటి సమస్య ఏర్పడకుండా చేపట్టే చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ తో పాటు మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post