చితి పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య.!

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన వేములఘాట్'లో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలగొట్టిన తన ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని మల్లారెడ్డి అనే వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చితిలో మిగిలిన శరీర భాగాలను పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

Previous Post Next Post