మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

◆ పలిమెల ఎస్సై అరుణ్ కుమార్
◆ బొర్రాయిగూడెంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
పలిమెల(లోకల్ అప్డేట్స్), ఏప్రిల్ 2 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని నీలంపల్లి  ఆమ్లెట్ గ్రామం అయిన గెర్రాయిగూడెంలో ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలో తనిఖీలు నిర్వహించి గ్రామస్తులతో సమావేశం అయ్యారు. గ్రామస్తులతో మాట్లాడుతూ మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహాకారాలు చేయకూడదని అన్నారు. మావోయిస్టుల కాలం చెల్లిన విధానాలతో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. సామాజిక దురాచారాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు సివిల్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم