అలుపెరగని పంచాయతీ కార్మికులు II మరెందరికో ఆదర్శం

లోకల్ న్యూస్, మార్చి26 : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలి జనాలు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో పలిమెల మండల కేంద్రంలో మాత్రం పారిశుద్ధ్య కార్మికులు అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. మహమ్మారి కరోనా వైరస్ నివారణకు వాళ్ళ వంతు పనులు చేస్తు శభాష్ అనిపించుకుంటున్నారు. గ్రామపంచాయతీ నుండి ఆదేశాలు వచ్చుడే తరువాయి వెంటనే కార్యక్రమం పూర్తి చేస్తున్నారు.
పారిశుద్ధ్య పనుల్లో భాగంగా గురువారం బ్లీచింగ్ పౌడర్ నీటిలో కలిపి గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా పంపుతో స్ప్రే చేశారు. కాగా పంచాయతీ పనులను బరువుగా కాకుండా బాధ్యతగా నిర్వర్తిస్తున్న కార్మికులను సర్పంచ్ జవ్వాజి పుష్పలత- తిరుపతి అభినందించారు. పలిమెల పంచాయతీలో మీరు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శం అని కొనియాడారు.

Post a Comment

Previous Post Next Post